ప్రజలు ఆలోచించి ఓటు వేయండి: అయ్యన్న

ABN , First Publish Date - 2021-11-13T21:23:59+05:30 IST

ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, దయచేసి దొంగలకు ఓటు వేయద్దని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సూచించారు.

ప్రజలు ఆలోచించి ఓటు వేయండి: అయ్యన్న

విశాఖ: ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, దయచేసి దొంగలకు ఓటు వేయద్దని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సూచించారు. జీవీఎంసీ ఉపఎన్నికల్లో 31వ వార్డు అభ్యర్థి తరఫున అంబేద్కర్ విగ్రహం నుంచి టీడీపీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పులు పాలుచేసిన ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం బయటకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. విజయ్ సాయిరెడ్డి, విశాఖను దోచుకొని నగరంలో ఉన్న ఆస్తులు తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. ఈ రోజు ఎయిడెడ్ స్కూల్స్‌ని ప్రైవేట్ పరం చేస్తావా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం జగన్ భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే అరెస్టులు చేయిస్తావా? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.

Updated Date - 2021-11-13T21:23:59+05:30 IST