వ్యాక్సిన్‌ కోసం జనం పడిగాపులు

ABN , First Publish Date - 2021-06-24T04:32:58+05:30 IST

శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రికి బుధవారం వ్యాక్సిన్‌ రాలేదు. అయితే ముందురోజు ఈ వ్యాక్సిన్లకు సంబంధించి సమాచారం లేకపోవడంతో పారిశ్రామిక ప్రాంతం నుంచి అనేక మంది ఉదయాన్నే ఆస్పత్రికి వచ్చారు.

వ్యాక్సిన్‌ కోసం జనం పడిగాపులు
వ్యాక్సిన్‌ కోసం వేచి ఉన్న జనం

మూడు గంటలు వేచి ఉండి నిరాశతో తిరుగుముఖం

మల్కాపురం, జూన్‌ 23 : శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రికి బుధవారం వ్యాక్సిన్‌ రాలేదు. అయితే ముందురోజు ఈ వ్యాక్సిన్లకు సంబంధించి సమాచారం లేకపోవడంతో పారిశ్రామిక ప్రాంతం నుంచి అనేక మంది ఉదయాన్నే ఆస్పత్రికి వచ్చారు. తొమ్మిది గంటల తరువాత భారీ వర్షం కురవడంతో వీరంతా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి ఆనుకుని ఉన్న పబ్లిక్‌ వర్క్స్‌ కార్యాలయం ఆవరణలో చాలా మంది వర్షం తగ్గేవరకు తలదాచుకున్నారు. వర్షం తగ్గేటప్పుటికి దాదాపు 11 గంటలు అయింది. ఆ తరువాత వ్యాక్సిన్‌ కోసం బారులుతీరారు. కొంతసేపటి తరువాత వ్యాక్సిన్‌ రాలేదని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. 


Updated Date - 2021-06-24T04:32:58+05:30 IST