ఏనుగును చంపిన వారిని వదలం: జావడేకర్
ABN , First Publish Date - 2020-06-05T07:54:30+05:30 IST
పేలుడు పదార్థాలున్న పండును తినిపించి కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగును చంపేసిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది...
న్యూఢిల్లీ, కొచ్చి, జూన్ 4: పేలుడు పదార్థాలున్న పండును తినిపించి కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగును చంపేసిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుంటామని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు.