అభివృద్ధి పనులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారు
ABN , First Publish Date - 2020-05-19T10:07:06+05:30 IST
ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
తిమ్మాపూర్, మే 18: ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సోమావారం తిమ్మాపూర్లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్షప్రభుత్వం నిధులు ఇస్తున్నా ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
సోమావారం తిమ్మాపూర్లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. మానకొండూర్ నియోజకవర్గానికి అత్యధికంగా 27 కోట్ల రూపాయల ఈజిఎస్ నిధులు తీసుకువచ్చామన్నారు. తిమ్మాపూర్ మండలానికి డీఎంఎఫ్ నిధులు 7.1 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు పెడింగ్లో ఉన్న పనులను తర్వగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత, వైస్ ఎంపీపీ ల్యాగాల వీరారెడ్డి, ఎంపీడీవో రవీందర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఇనుకొండ జితేందర్రెడ్డి పాల్గొన్నారు.