ఒమైక్రాన్‌తో ప్రజలు ఆందోళన చెందొద్దు: హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-01-19T17:54:03+05:30 IST

ఓమైక్రాన్‌తో ప్రజలు ఆందోళన చెందొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు.

ఒమైక్రాన్‌తో ప్రజలు ఆందోళన చెందొద్దు: హరీష్‌రావు

సిద్దిపేట: ఒమైక్రాన్‌తో ప్రజలు ఆందోళన చెందొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం గజ్వేల్‌లో ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసి, వైద్య సదుపాయాల గురించి రోగులతో మాట్లాడి ఆరాతీశారు.మంత్రి హరీష్‌రావుతో పాటు ఎమ్మెల్సీ యాదవ‌రెడ్డి ఉన్నారు. ఈసందర్భంగా  మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2 కోట్ల కరోన పరీక్షల కిట్లు,  కోటి హోమ్  ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కరోన చికిత్స కోసం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు భేష్‌గా ఉన్నాయన్నారు. ఐసోలేషన్ కోసం సిద్దిపేటలో ఆక్సిజన్ సౌకర్యంతో వంద పడకల ఆస్పత్రి ఉందని చెప్పారు.సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని హరీష్‌రావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-19T17:54:03+05:30 IST