ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలి
ABN , First Publish Date - 2021-02-25T04:56:17+05:30 IST
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని దర్శి నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ పమిడి రమేష్ అన్నారు. బుధవారం ముండ్లమూరు గ్రామ సర్పంచ్గా ఒద్దిపోగు ఆదిలక్ష్మి ప్రమాణ స్వీకారం గ్రామ సచివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్చార్జ్ పమిడి రమేష్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తరువాత పార్టీలకు అతీతంగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.
నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ పమిడి రమేష్
ముండ్లమూరు, ఫిబ్రవరి 24 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని దర్శి నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ పమిడి రమేష్ అన్నారు. బుధవారం ముండ్లమూరు గ్రామ సర్పంచ్గా ఒద్దిపోగు ఆదిలక్ష్మి ప్రమాణ స్వీకారం గ్రామ సచివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్చార్జ్ పమిడి రమేష్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తరువాత పార్టీలకు అతీతంగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ముండ్లమూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కష్టపడిన ఫలితంగానే సర్పంచ్ అభ్యర్థి గెలుపొందారన్నారు. అనంతరం ఇన్చార్జ్ రమే్షను గ్రామ టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. నూతన సర్పంచ్ ఆదిలక్ష్మి, ఉప సర్పంచ్ నారాయణమ్మలను కూడా గ్రామస్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేదరమెట్ల వెంకటరావు, మండల టీడీపీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, ఏజేపీ వీరపనేని రంగా, గంగినేని శేషగిరిరావు, రంగ నాయకులు, వీరపనేని బుచ్చిబాబు, బోడపాటి హనుమంతరావు, ముప్పాళ్ళ కోటేశ్వరరావు, వీరపనేని నాగమల్లి, కంకణాల వెంకటరావు, బత్తిన సురేష్, ఒద్దిపోగు గురవయ్య, రమేష్, వెంకటేశ్వర్లు, వీర నారాయణ, తాతపూడి తెల్లయ్య తదితరులు పాల్గొన్నారు.