అంకిత భావంతో విధులు నిర్వహించాలి : కమిషనర్
ABN , First Publish Date - 2021-07-30T06:17:22+05:30 IST
సచివాలయ ఉద్యోగులు అంకిత భా వంతో విధులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా సూచించారు.
రాయదుర్గం టౌన, జూలై 29 : సచివాలయ ఉద్యోగులు అంకిత భా వంతో విధులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా సూచించారు. పట్టణంలోని 16, 17 సచివాలయాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, పోస్ట ర్లు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు. సమస్యలపై వచ్చే ప్రజల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. సచివాలయ ఉద్యోగులు విధుల నిమి త్తం బయటకు వెళ్లే సమయంలో మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ ఖాదర్ మోహిద్దీన పాల్గొన్నారు.
బ్రహ్మసముద్రం: మండలంలోని బైరసముంద్రం, బ్రహ్మసముద్ర గ్రా మాల్లోని గ్రామ సచివాలయాలను ఎంపీడీఓ రామకృష్ణ గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఉద్యోగుల హాజరు, రికార్డులను పరిశీలించారు. ప్రభత్వ ఫలాలు లబ్ధిదారులకు సక్రమంగా అందేఆ చూడాలని సి బ్బందికి సూచించారు. అనంతరం సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించారు. నాణ్యతగా భవనాలను నిర్మించాలనికాంట్రాక్టర్లను ఆదేశించారు.