పెరియార్ మనవడు బీజేపీలో చేరిక
ABN , First Publish Date - 2020-08-15T07:53:41+05:30 IST
పెరియార్ నేలపై బీజేపీ ఎప్పటికీ బలపడలేదన్న డీఎంకే వ్యాఖ్యలను సవాలు చేస్తున్నట్లుగా తమిళనాడులో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏకంగా పెరియార్ మనవడు సతీశ్ కృష్ణ...
చెన్నై, ఆగస్టు 14: పెరియార్ నేలపై బీజేపీ ఎప్పటికీ బలపడలేదన్న డీఎంకే వ్యాఖ్యలను సవాలు చేస్తున్నట్లుగా తమిళనాడులో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏకంగా పెరియార్ మనవడు సతీశ్ కృష్ణ.. బీజేపీలో చేరారు. సామాజిక ఉద్యమనేత, ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పిలిచే పెరియార్ మనవడే కాషాయ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. డీఎంకే ఎమ్మెల్యే కూకా సెల్వం ఇటీవల మోదీని ప్రశంసిస్తూ మాట్లాడటంతో ఆయనను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కమలం గూటికి చేరేందుకు సెల్వం సన్నాహాలు చేసుకుంటున్నారు.