సినిమా టికెట్ల ధరలను నియంత్రించాలని నిర్ణయించాం: పేర్ని నాని
ABN , First Publish Date - 2021-09-14T21:30:13+05:30 IST
సినిమా టికెట్స్ను ఆన్లైన్ ద్వారానే విక్రయించాలని సినీ ప్రముఖులు కోరారని, అందుకే ఏపీ ప్రభుత్వం ...
అమరావతి: సినిమా టికెట్స్ను ఆన్లైన్ ద్వారానే విక్రయించాలని సినీ ప్రముఖులు కోరారని, అందుకే ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమా టికెట్ల ధరలను నియంత్రించాలని నిర్ణయించామని, ఆన్లైన్ టికెట్స్పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఆన్లైన్ టికెట్స్ను ఏపీ ఫిల్మ్ థియేటర్, టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్..ద్వారా అమ్మాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విధానం అధ్యయనానికి హోంశాఖ ముఖ్యకార్యదర్శిని చైర్మన్గా నియమించామన్నారు. ఆన్లైన్ టికెట్స్ అమ్మకాల ద్వారా బ్లాక్ మార్కెట్, పన్ను ఎగవేతను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.