చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-10-23T15:22:21+05:30 IST
బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
నిర్మల్: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మల్ జిల్లా కడెం మండలం దోస్తునగర్ గ్రామ సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పెంబి మండల్ మందపల్లికి చెందిన పుసుకురి రాజేష్ (27) మృతి చెందాడు.