అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-21T18:25:43+05:30 IST
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం గని ఆత్కూరు రోడ్డులో అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం గని ఆత్కూరు రోడ్డులో అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒంటిపై కాలిన గాయాలతో మృతదేహం లభ్యమైంది. మృతుడు సాంబశివరావు, మూలపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.