బైక్ను ఢీకొన్న కారు.. తండ్రి మృతి.. కొడుకు పరిస్థితి విషమం
ABN , First Publish Date - 2020-02-19T16:15:51+05:30 IST
సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని రైల్ నిలయం వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని రైల్ నిలయం వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఓ తండ్రి తన కొడుకును బైక్పై స్కూల్కి తీసుకెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన తండ్రీకొడుకులను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే తండ్రి మృతి చెందాడు. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.