కర్నూలు: వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2020-11-24T17:04:04+05:30 IST

కర్నూలు: కల్లూరు మండలం బస్తిపాడులో ఓ హత్యని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.

కర్నూలు: వ్యక్తి దారుణ హత్య

కర్నూలు: కల్లూరు మండలం బస్తిపాడులో ఓ హత్యని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బస్తిపాడుకు చెందిన తెలుగు దస్తగిరి అనే వ్యక్తిని వేట కొడవలితో నరికి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

Updated Date - 2020-11-24T17:04:04+05:30 IST