అనారోగ్య కారణాలతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-21T05:55:05+05:30 IST
అనారోగ్య కారణాలతో ఓ వ్యక్తి ఉరిపోసుకుని మృతిచెందాడు. ఘటన మంగళవారం మండలంలోని పెద్దకనుమళ్ల గ్రామంలో చోటుచేసుకుంది.
సింగరాయకొండ, ఏప్రిల్ 20 : అనారోగ్య కారణాలతో ఓ వ్యక్తి ఉరిపోసుకుని మృతిచెందాడు. ఘటన మంగళవారం మండలంలోని పెద్దకనుమళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పెద్దకనుమళ్ల గ్రామంలోని తన్నీరు నాగేశ్వరరావు(61) పక్షవాతానికి గురై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం మధాహ్నం 1 గంట సమయంలో తన ఇంటికి ఎదురుగా ఉన్న బాత్రూంలో కేబుల్ వైరు మెడకు చుట్టుకొని ఉరివేసుకుని మరణించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.