పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో పిటిషన్‌

ABN , First Publish Date - 2021-08-31T02:20:00+05:30 IST

తెలంగాణలో పాఠశాలలు ప్రారంభించాలంటూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై

పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలలు ప్రారంభించాలంటూ  ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలయింది. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలుచేస్తూ బాలకృష్ణ పిటిషన్‌ వేసారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఉత్తర్వులు జారీచేశారని పిటిషనర్‌ పేర్కొన్నారు.  భౌతిక దూరం, పిల్లల హాజరు, ఆన్‌లైన్ తరగతుల నిలిపివేత అంశాలపై స్పష్టత లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. పాఠశాలల ప్రారంభానికి నిపుణుల కమిటీ సిఫార్సులను తెప్పించి ప్రభుత్వం పరిశీలించాలని పిటిషనర్‌ కోరారు. పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ చేపట్టనున్నది.  


Updated Date - 2021-08-31T02:20:00+05:30 IST