పెట్రో బాదుడు భరించలేం

ABN , First Publish Date - 2021-06-19T05:50:24+05:30 IST

పెట్రోలు ధరలను తగ్గించాలని కోరుతూ శ్రీకాళహస్తిలో ప్రజాసంఘాలు వినూత్నంగా నిరసన తెలిపాయి.

పెట్రో బాదుడు భరించలేం
ఆటోను తాళ్లతో లాగుతున్న ప్రజా సంఘాల నాయకులు

శ్రీకాళహస్తి అర్బన్‌, జూన్‌ 18: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు ధరలను తగ్గించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణ అంబేడ్కర్‌ కూడలి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులు ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. పలువురు మాట్లాడుతూ... పెట్రో ధరల పెంపు సామాన్యుల నడ్డి విరుస్తోందని వాపోయారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగకున్నా, దేశంలో ధరలు పెంచడం భావ్యం కాదన్నారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్రం ధరల బాదుడుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో గంధం మణి, జనమాల గురవయ్య, జాకీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T05:50:24+05:30 IST