పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-03-05T06:10:16+05:30 IST

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని టీఆర్‌ఎస్‌ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు సుంకపాక మనోజ్‌ డిమాం డ్‌ చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
నిరసన తెలుపుతున్న నాయకులు

సిరిసిల్ల టౌన్‌, మార్చి 4: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని టీఆర్‌ఎస్‌ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు సుంకపాక మనోజ్‌ డిమాం డ్‌ చేశారు. గురవారం సిరిసిల్ల పట్టణం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ యువజన విభాగం పట్టణ శాఖ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. ‘తాతా నీకో దండం’ అంటూ మోదీ చిత్రంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వినూత్న నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా మనోజ్‌ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు పెరుగతున్న పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోందన్నారు. నెలకోసారి ‘మన్‌ కీ బాత్‌’లో నీతి సూక్తులు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ పెరిగిన పెట్రోల్‌, డీజీల్‌, వంట గ్యాస్‌ ధరలపై ఎందుకు మాట్లాడరని పశ్నించారు.   ధరలను వెంటనే తగ్గించని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. నాయకులు కత్తెర వరుణ్‌, ఎస్‌కే మయిమూద్‌, సిఖిందర్‌, యాదగిరి, బుర్ర కిషార్‌గౌడ్‌, కొక్కుల రవి, బొద్దుల కార్తిక్‌, మునీర్‌, అంజద్‌, వినయ్‌, మదు, ఉదయ్‌, కృష్ణ, సిరోజ్‌ అఫ్రోజ్‌, చోటు, శ్రీధర్‌, పవన్‌, భరత్‌, అంజి, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T06:10:16+05:30 IST