పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి : పీవోడబ్ల్యూ

ABN , First Publish Date - 2021-10-22T06:08:54+05:30 IST

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని పీవోడబ్ల్యూ జిల్లా కన్వీనర్‌ కొత్తపల్లి రేణుక డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను గురువారం దహనం చేశారు. దేశ సంపదను ప్రధాని మోదీ

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి : పీవోడబ్ల్యూ
గ్యాస్‌ సిలిండర్‌తో నిరసన తెలుపుతున్న పీవోడబ్ల్యూ నాయకులు

సూర్యాపేట కల్చరల్‌, అక్టోబరు 21: పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని పీవోడబ్ల్యూ జిల్లా కన్వీనర్‌ కొత్తపల్లి రేణుక డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను గురువారం దహనం చేశారు. దేశ సంపదను ప్రధాని మోదీ ఆదానీ, అంబానీకి దోచి పెడుతుంటే, రాష్ట్ర సంపదను సీఎం కేసీఆర్‌ మెగా కృష్ణారెడ్డికి, రామేశ్వర్‌రావుకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు జయమ్మ, చంద్రకళ, లక్ష్మీ, కవిత, నాగేంద్ర, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T06:08:54+05:30 IST