పెట్రోల్‌ బంకులో దోపిడీ

ABN , First Publish Date - 2021-04-21T05:13:52+05:30 IST

మండలంలోని కూకట్లపల్లి సమీపంలో ఉన్న ఎం అండ్‌ఎం పెట్రోల్‌ బంకులో దోపిడీ జరిగింది.

పెట్రోల్‌ బంకులో దోపిడీ

రూ.10వేల నగదు అపహరణ

అడ్డుకున్న పంప్‌బాయ్‌పై దాడి

బల్లికురవ, ఏప్రిల్‌ 20: మండలంలోని కూకట్లపల్లి సమీపంలో ఉన్న ఎంఅండ్‌ఎం పెట్రోల్‌ బంకులో దోపిడీ జరిగింది. రూ.10వేల నగదును దొంగలు అపహరించుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్లపల్లి గ్రామ పరిధిలో ఉన్న ఎంఅండ్‌ఎం ఇండేన్‌ పెట్రోల్‌ బంకులో సోమవారం రాత్రి ఇద్దరు సి బ్బంది డ్యూటీలో ఉన్నారు. రాత్రి  రెండు గంటల సమయంలో ముగ్గురు వ్య క్తులు పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చారు. అందులో ఒక వ్యక్తి లోపలికి చేరుకొని పంప్‌ బాయ్‌ జాగర్లమూడి సుబ్బారావు వద్ద ఉన్న నగదు సంచిని లాక్కొ న్నాడు. ఆ సమయంలో అతను ఎదురు తిరగడంతో వెనుక ఉన్న మరో దొం గ రాయి విసిరాడు. సుబ్బారావు తీవ్రంగా గాయపడగా దొంగలు అక్కడి నుం చి పరారయ్యారు. దీన్ని గుర్తించిన మరో వర్కర్‌ తిరుపతిరావు వెంటనే బం కు యజమానికి సమాచారం ఇచ్చి గాయాలైన సుబ్బారావుని అద్దంకి వైద్యశాలకు తరలించారు. అనంతరం బంకు యజమాని ముండ్రు చినదానయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు దొంగలు కేవలం ఒంటిపై డ్రాయర్ల తోనే అక్కడికి వచ్చినట్లు సీసీ ఫుటేజ్‌లో బయటపడింది. ఇద్దరు గోడచాటున ఉండగా, మరొకరు బంకులోకి ప్రవేశించినట్లు చెప్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-04-21T05:13:52+05:30 IST