పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి
ABN , First Publish Date - 2021-02-25T04:58:35+05:30 IST
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కాసుల బాల్రాజ్ అన్నారు.
కోటగిరి, ఫిబ్రవరి 24 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కాసుల బాల్రాజ్ అన్నారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కోటగిరిలో బుధవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కాసుల బాల్రాజ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పేద ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్స్టీ ఎత్తివేయడంతోపాటు పెంచిన ధరలను తగ్గించడం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్, మనోహర్, వేములపల్లి సత్యం, అంబర్సింగ్, షాహెద్, మల్లికార్జున్అప్ప తదితరులున్నారు.