రెండు రోజుల తర్వాత మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ABN , First Publish Date - 2021-05-10T13:33:53+05:30 IST

దేశంలో వాహనచోదకులపై కేంద్రం మరోసారి పెట్రో భారం మోపింది....

రెండు రోజుల తర్వాత మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ : దేశంలో వాహనచోదకులపై కేంద్రం మరోసారి పెట్రో భారం మోపింది. రెండురోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం మళ్లీ ఎగబాకాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోలు లీటరుకు 26 పైసలు, డీజిల్ లీటరుపై 33 పైసల ధర పెంచుతూ చమురు సంస్థలు ధరల నోటిఫికేషన్ ను సోమవారం ఉదయం విడుదల చేసింది. దీంతో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర 91.53రూపాయలకు, డీజిల్ లీటరు ధర రూ.82.06కు పెరిగింది. హైదరాబాద్ నగరంలో పెట్రోలు ధర లీటరుకు 27 పైసలు, డీజిల్ ధర 36 పైసల చొప్పున పెరిగాయి. 


హైదరాబాద్ నగరంలో సోమవారం పెట్రోలు ధర రూ.9513, డీజిల్ లీటరు ధర రూ.89.47 కు పెరిగింది. విజయవాడలో పెట్రోలు రూ.97.82, డీజిల్ ధర రూ.91.61కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెటులో ముడిచమురు ధరలు పెరగటంతో దేశంలో పెట్రోలు ధరలు పెంచారు. గత వారం రోజుల నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూ వందరూపాయలకు చేరువలో ఉండటంతో వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-05-10T13:33:53+05:30 IST