మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...record

ABN , First Publish Date - 2021-10-27T14:22:17+05:30 IST

రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ బుధవారం పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి...

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...record

న్యూఢిల్లీ : రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ బుధవారం పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి.దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.107.94,డీజిల్ లీటరు ధర రూ.96.67కి పెరిగాయి.దీంతో ఇంధన ధరలు బుధవారం రికార్డు స్థాయికి ఎగిశాయి. విమానయాన టర్బైన్ ఇంధనం ఏటీఎఫ్ లేదా జెట్ ఇంధనం విమానయాన సంస్థలకు విక్రయించే ధర కంటే ఇప్పుడు పెట్రోల్ ధర 36.63 శాతం ఎక్కువ కావడం విశేషం.నాలుగు మెట్రో నగరాల్లో పోలిస్తే ఇంధన ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయని ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ ల కారణంగా ఇంధన ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబైలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.113.80, డీజిల్ లీటరుకు రూ. 104.75 కు పెరిగింది.


 చెన్నైలో పెట్రోల్ ధరలు లీటరు మార్కు రూ. 105కి చేరింది. చెన్నైలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.104.83 కు పెరిగింది.హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 36 పైసలు పెరిగి రూ.112.27కు చేరింది. డీజిల్‌ ధర లీటరుపై 38 పైసలు పెరిగి రూ.105.46కు చేరింది.ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వరంగ చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి.ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు నిల్వలు ఊహించిన దాని కంటే ఎక్కువగా పెరిగాయి.


Updated Date - 2021-10-27T14:22:17+05:30 IST