పీహెచ్‌సీ భవన నిర్మాణ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2021-08-02T05:43:18+05:30 IST

స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో సుమారు రూ.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు వైస్‌ చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నయీంఅహ్మద్‌ ఆదివారం పరిశీలించారు.

పీహెచ్‌సీ భవన నిర్మాణ పనుల పరిశీలన
నిర్మాణ పనులను పరిశీలిస్తున్న వైస్‌ చైర్మన్‌, కమిషనర్‌

మార్కాపురం (వన్‌టౌన్‌), ఆగస్టు 1 : స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో సుమారు రూ.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు వైస్‌ చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌, మున్సిపల్‌  కమిషనర్‌ నయీంఅహ్మద్‌ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ ఆరోగ్య కేంద్రం పూర్తి అయితే పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. డీఈ షేక్‌ సుభానీ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T05:43:18+05:30 IST