Philippines‌: భారత ప్రయాణికులకు నో ఎంట్రీ

ABN , First Publish Date - 2021-07-31T06:39:44+05:30 IST

కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఫిలిప్పీన్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణికులపై అమలులో ఉన్న నిషేధాన్ని పొడిగించింది. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే అ

Philippines‌: భారత ప్రయాణికులకు నో ఎంట్రీ

న్యూఢిల్లీ: కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఫిలిప్పీన్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణికులపై అమలులో ఉన్న నిషేధాన్ని పొడిగించింది. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే అమలులో ఉన్న నిషేధాన్ని ఆగస్ట్ 15 వరకు పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. భారత్ సహా పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్, యూఏఈ, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ దేశాల ప్రయాణికులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని వెల్లడించింది. కాగా.. భారత ప్రయాణికులపై ఫిలిప్పిన్స్ ఏప్రిల్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-07-31T06:39:44+05:30 IST