మహిళను వేధించిన వ్యక్తికి దేహశుద్ధి

ABN , First Publish Date - 2021-03-27T12:08:50+05:30 IST

ఫోన్‌ చేసి మహిళను అసభ్యకరంగా వేధిస్తున్న వ్యక్తికి

మహిళను వేధించిన వ్యక్తికి దేహశుద్ధి

హైదరాబాద్/సైదాబాద్‌ : ఫోన్‌ చేసి మహిళను అసభ్యకరంగా వేధిస్తున్న వ్యక్తికి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. లక్ష్మీనగర్‌ కాలనీలో ఉంటున్న మహిళకు తరచూ ఓవ్యక్తి ఫోన్‌ చేసి వేధిస్తున్నాడు. విషయాన్ని మహిళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దాంతో శుక్రవారం మహిళతో ఆ యువకుడికి ఫోన్‌ చేయించి ఇంటికి రమ్మని పిలిపించారు. ఆ వ్యక్తి అక్కడకు రాగానే అతడిని వివస్తృడిని చేసి చితకబాదారు. స్థానికులు ఆ వ్యక్తికి లుంగీ ఇవ్వడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. కాగా బాధితు డు తన వివరాలు చెప్పేందుకు నిరాకరించాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. 

Updated Date - 2021-03-27T12:08:50+05:30 IST