విద్యుత్‌శాఖ డీఈగా పిచ్చయ్య

ABN , First Publish Date - 2021-10-17T07:04:50+05:30 IST

విద్యుత్‌శాఖ దర్శి సబ్‌ డివిజన్‌ డిప్యూటీ ఎగ్జిగ్యూటివ్‌ ఇంజనీర్‌గా కె.పిచ్చయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు.

విద్యుత్‌శాఖ డీఈగా పిచ్చయ్య

దర్శి, అక్టోబరు 16 : విద్యుత్‌శాఖ దర్శి సబ్‌ డివిజన్‌ డిప్యూటీ ఎగ్జిగ్యూటివ్‌ ఇంజనీర్‌గా కె.పిచ్చయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు. ఒంగోలు రూరల్‌ సబ్‌ డివిజనల్‌లో పనిచేస్తున్న పిచ్చయ్యను ఇక్కడకు బదిలీచేశారు. గతంలో ఆయన దర్శిలో సుమారు నాలుగు సంవత్సరాలు విద్యుత్‌ శాఖ ఏడిగా పనిచేశారు. బాధ్యతలు  చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యల పరిష్కారంకు పటిష్ట చర్యలు తీసుకుంటామని క్వాలిటీ కరెంట్‌ అందించేందుకు కృషి చేస్తామన్నారు.

Updated Date - 2021-10-17T07:04:50+05:30 IST