ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడమేంటి నాన్సెన్స్ : కెవిన్ పీటర్సన్
ABN , First Publish Date - 2020-09-23T23:10:09+05:30 IST
కమెంటేటర్గా మారిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై జట్టులో ఆడుతున్న భారత మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు చేశాడు...
కమెంటేటర్గా మారిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై జట్టులో ఆడుతున్న భారత మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీలాంటి ఆటగాడు ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడం సరైన నిర్ణయం కాదని, ఇలాగే కొనసాగితే జట్టు ఫైనల్ వరకు రావడం కష్టమని పీటర్సన్ కామెంట్ చేశాడు. టీ-20 క్రికెట్ ఫార్మాట్లో ఆటగాళ్లు చాలా వేగంగా ఉండాలని లేకపోతే క్షణాల్లో ఫలితం తారుమారు అవుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.