ఇండియా-న్యూజిలాండ్ రెండో టీ20.. వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిల్

ABN , First Publish Date - 2021-11-19T21:17:29+05:30 IST

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య నేడు రాంచీలో రెండో టీ20 జరగనుంది. కరోనా నేపథ్యంలో

ఇండియా-న్యూజిలాండ్ రెండో టీ20.. వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిల్

రాంచీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య నేడు రాంచీలో రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌ను వాయిదా వేయాలంటూ జార్ఖండ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. కరోనా నేపథ్యంలో మాల్స్, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్సులలో 50 శాతానికి మించి జనాన్ని అనుమతించడం లేదని, అలాంటిది స్టేడియంలో వందశాతం మంది ప్రేక్షకులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తూ ధీరజ్ కుమార్ అనే న్యాయవాది కోర్టులో పిల్ దాఖలు చేశారు. మిగతా వాటికి అనుమతిస్తున్నట్టుగానే క్రికెట్ స్టేడియంలోకి కూడా 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని లేని పక్షంలో మ్యాచ్‌ను వాయిదా వేయాలని కోర్టును కోరారు. 


Updated Date - 2021-11-19T21:17:29+05:30 IST