వరద బాధితులకు ఆన్‌లైన్‌లో ఆర్థిక సహాయం చేయాలంటూ పిల్‌

ABN , First Publish Date - 2020-10-22T07:19:51+05:30 IST

భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన వరద బాధితులకు నగదు రూపంలో రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తున్న సహాయాన్ని

వరద బాధితులకు ఆన్‌లైన్‌లో ఆర్థిక సహాయం చేయాలంటూ పిల్‌

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన వరద బాధితులకు నగదు రూపంలో రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తున్న సహాయాన్ని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలంటూ దాఖలైన వ్యాజ్యం లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది.

వరద బాధితులకు ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతున్న ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్థిక సాయాన్ని నగదు రూపేణా ఇచ్చేందుకు తెచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ న్యాయవాది సీవీ శ్రీనాథ్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.   


Updated Date - 2020-10-22T07:19:51+05:30 IST