4న పినాకిని ఎక్స్ప్రెస్ గూడూరు వరకే...
ABN , First Publish Date - 2021-12-31T16:33:20+05:30 IST
జనవరి నెల 4వ తేదీన విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ రావాల్సిన పినాకినీ ఎక్స్ప్రెస్ (12711) గూడూరు వరకే ఆగిపోనుంది. తిరిగి అదే రైలు (12712) అదే రోజు సాయంత్రం 4.20 గంటలకు గూడూరు నుంచి విజయవాడ
చెన్నై: జనవరి నెల 4వ తేదీన విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ రావాల్సిన పినాకినీ ఎక్స్ప్రెస్ (12711) గూడూరు వరకే ఆగిపోనుంది. తిరిగి అదే రైలు (12712) అదే రోజు సాయంత్రం 4.20 గంటలకు గూడూరు నుంచి విజయవాడ బయలుదేరనుంది.
- మదురై - ఎగ్మూర్ వైగై సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12636) జనవరి 5, 19 తేదీల్లో విల్లుపురం వరకే వచ్చి ఆగిపోనుంది.
- ఎగ్మూర్ - కారైక్కుడి పల్లవన్ ఎక్స్ప్రెస్ (12605) జనవరి 5, 19 తేదీల్లో విల్లుపురం వరకే వచ్చి ఆగిపోనుంది. ఈ రైలు ఆయా రోజుల్లో సాయంత్రం 6.10 గంటలకు విల్లుపురం నుంచి బయలుదేరనుంది.
- జనవరి 5, 19 తేదీల్లో బయలుదేరే పుదుచ్చేరి - న్యూ ఢిల్లీ వీక్లీ ఎక్స్ప్రెస్ (22403)ను దారి మళ్లించారు. ఈ రైలు విల్లుపురం - కాట్పాడి - అరక్కోణం - పెరంబూర్ - కొరుకుపేట మీదగా వెళ్లనుంది. ఈ రైలు ఎగ్మూరు వెళ్లనందున అదనంగా పెరంబూరులో ఆగుతుందని దక్షిణరైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.