‘పింక్ డైమండ్‌‌పై నానా యాగీ చేసిన వాళ్లు ఏం తేల్చారు?’

ABN , First Publish Date - 2020-05-24T02:27:10+05:30 IST

తిరుమలేశుడి పింక్ డైమండ్ అంశంపై టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ మరోసా తీవ్రంగా స్పందించారు. తిరుమల శ్రీనివాసుని పింక్ డైమండ్ పోయిందని నానా యాగీ చేసిన వాళ్లంతా చివరికి ఏం తేల్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

‘పింక్ డైమండ్‌‌పై నానా యాగీ చేసిన వాళ్లు ఏం తేల్చారు?’

అమరావతి: తిరుమలేశుడి పింక్ డైమండ్ అంశంపై టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ మరోసా తీవ్రంగా స్పందించారు. తిరుమల శ్రీనివాసుని పింక్ డైమండ్ పోయిందని నానా యాగీ చేసిన వాళ్లంతా చివరికి ఏం తేల్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. తాము చేసిన ఆరోపణలు తప్పు అని ఒప్పుకుంటారా? లేక తప్పుని నిరూపించే సమర్థత లేదని తప్పుకుంటారా? అని వైసీపీ శ్రేణులనుద్దేశించి తీవ్రంగా స్పందించారు. ఏడాది పాలన సంబరాలు చేసుకుంటున్న వాళ్లు దీనికి సమాధానం చెప్పాలన్నారు.

Updated Date - 2020-05-24T02:27:10+05:30 IST