హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలి: పితాని సత్యనారాయణ
ABN , First Publish Date - 2021-05-06T09:04:20+05:30 IST
‘‘రాష్ట్రంలోనూ, దేశంలోనూ హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి. కొవిడ్ కట్టడిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రోజూ వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
రాజమహేంద్రవరం, మే 5(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోనూ, దేశంలోనూ హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి. కొవిడ్ కట్టడిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రోజూ వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది’’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మీడియాతో ఆయన మాట్లాడారు.