రెడ్‌జోన్‌గా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీ

ABN , First Publish Date - 2021-07-31T05:17:37+05:30 IST

పిఠాపురం, జూలై 30: పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని రెడ్‌ (కంటైన్మెంట్‌) జోన్‌గా ప్రకటించారు. కాలనీలో శుక్రవారం కమిషనర్‌ ఎం.రామ్మోహన్‌, తహశీల్దార్‌ వరహాలయ్య, ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యాధికారి

రెడ్‌జోన్‌గా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీ
జగ్గయ్యచెరువు కాలనీలో పర్యటిస్తున్న అధికారులు

ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణాలకు అనుమతి

పిఠాపురం, జూలై 30: పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని రెడ్‌ (కంటైన్మెంట్‌) జోన్‌గా ప్రకటించారు. కాలనీలో శుక్రవారం కమిషనర్‌ ఎం.రామ్మోహన్‌, తహశీల్దార్‌ వరహాలయ్య, ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ విజయశేఖర్‌, పట్టణ ఎస్‌ఐ శంకరరావు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కేసులు అధి కంగా ఉన్న నేపథ్యంలో కాలనీ పరిధిలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం కంటైన్మెంట్‌ జోన్‌గా గుర్తించి రాకపోకలపై అంక్షలు విధించారు. ఉదయం 10 తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశమైంది. పట్టణ పరిధిలో కొవిడ్‌ పరిస్థితిపై చర్చించారు. 

Updated Date - 2021-07-31T05:17:37+05:30 IST