టీడీపీ ఆదరణ చూసి వైసీపీ భయపడుతోంది

ABN , First Publish Date - 2021-10-22T05:07:06+05:30 IST

ప్రజల్లో టీడీపీకి ఉన్న ఆదరణ చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిఽధి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు.

టీడీపీ ఆదరణ చూసి వైసీపీ భయపడుతోంది
మాట్లాడుతున్న పార్టీ అధికార ప్రతినిధి వర్మ

  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ
కాకినాడ సిటీ, అక్టోబరు 21: ప్రజల్లో టీడీపీకి ఉన్న ఆదరణ చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిఽధి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా వర్మ మొదటిసారి గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందనే అక్కసుతోనే తమ పార్టీ వారిపై దాడులు, అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు తప్ప రాష్ట్ర అభివృద్ధి శూన్యమని అన్నారు.  వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్టు బూతులు తిడుతుంటే వారి నాయకులకు భగవద్గీతలా వినిపిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని భౌతిక దాడులకు దిగుతున్నారన్నారు. ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని వర్మ హెచ్చరించారు.

Updated Date - 2021-10-22T05:07:06+05:30 IST