ఆ రిపోర్టులో నా పేరు, అచ్చెన్న పేరు ఎక్కడా లేదు: పితాని
ABN , First Publish Date - 2020-02-22T19:10:48+05:30 IST
రాజమండ్రి: జగన్ ప్రభుత్వం తమపై బురదజల్లడం మానుకోవాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు.
రాజమండ్రి: జగన్ ప్రభుత్వం తమపై బురదజల్లడం మానుకోవాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. విజిలెన్స్ రిపోర్టులో తన పేరు, అచ్చెన్నాయుడు పేరు ఎక్కడా లేదన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ సీఎం కార్యాలయం నుంచి వస్తుందన్న అవగాహన లేకుండా మంత్రి జయరాం మాట్లాడుతున్నారన్నారు.
2017 ఏప్రిల్లో కార్మిక మంత్రిగా తాను బాధ్యత తీసుకున్నానని పితాని వెల్లడించారు. రిపోర్ట్లో పేర్కొన్న డైరక్టర్లు రవికుమార్, రమేష్లపై తాను మంత్రిగా ఉన్నప్పుడే విచారణకు ఆదేశించానన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ, సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని పితాని సత్యనారాయణ వెల్లడించారు.