పయాస్‌.. ప్రపంచ నెంబర్‌వన్‌

ABN , First Publish Date - 2021-10-20T07:45:16+05:30 IST

ప్రపంచ టేబుల్‌ టెన్ని్‌సలో భారత కుర్రాడు పయాస్‌ జైన్‌ అదరగొట్టాడు. ఈ ఢిల్లీ స్టార్‌ అండర్‌-17 బాలుర టీటీలో ప్రపంచ నెంబర్‌వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు.

పయాస్‌.. ప్రపంచ నెంబర్‌వన్‌

  అండర్‌-17 టీటీలో ఢిల్లీ కుర్రాడికి టాప్‌ర్యాంక్‌

న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌లో భారత కుర్రాడు పయాస్‌ జైన్‌ అదరగొట్టాడు. ఈ ఢిల్లీ స్టార్‌ అండర్‌-17 బాలుర టీటీలో ప్రపంచ నెంబర్‌వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. దీంతో మానవ్‌ ఠక్కర్‌ తర్వాత ప్రపంచ టీటీలో టాప్‌ర్యాంక్‌ను కైవసం చేసుకున్న రెండో భారత ప్యాడ్లర్‌గా పయాస్‌ నిలిచాడు. నిరుడు జనవరిలో ఠక్కర్‌ అండర్‌-21 బాలుర కేటగిరిలో అగ్రపీఠాన్ని అందుకున్నాడు. ర్యాంకింగ్స్‌లో 3458 పాయింట్లతో పయాస్‌ అగ్రస్థానంలో నిలవగా, పయాస్‌ కంటే 90 పాయింట్లు వెనుకంజలో ఉన్న రొమేనియా ప్యాడ్లర్‌ డారియస్‌ మొవిలేను రెండో ర్యాంకులో ఉన్నాడు. 17 ఏళ్ల జైన్‌.. ఈ సీజన్‌లో మూడు అంతర్జాతీయ టైటిళ్లు సాధించడంతో పాటు మరికొన్ని టోర్నీల్లో మూడోస్థానంతో కాంస్యాలు అందుకున్నాడు. 

Updated Date - 2021-10-20T07:45:16+05:30 IST