నితీశ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రశాంత్ కిశోర్

ABN , First Publish Date - 2020-03-27T00:12:51+05:30 IST

ముఖ్యమంత్రి నితీశ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్....

నితీశ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రశాంత్ కిశోర్

పాట్నా : ముఖ్యమంత్రి నితీశ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.... గురువారం మాత్రం ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న బిహారీలకు వంద కోట్ల ప్యాకేజీని విడుదల చేయడాన్ని ప్రశాంత్ కిశోర్ స్వాగతించారు.


‘‘ప్రజలందరి ఆగ్రహం తర్వాత, లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న బిహారీలకు, కరోనాను ఎదుర్కొనేందుకు బిహార్ ప్రభుత్వం చేసిన చర్యలు ప్రశంసనీయం. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వంద కోట్లు ప్రకటించడం హర్షణీయం. దీనికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని పీకే గురువారం ట్వీట్ చేశారు.


వివిధ ప్రాంతాల్లో బిహారీలు చిక్కుకుపోవడానికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైఖరే కారణమని బుధవారం నితీశ్ కుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మిగితా ప్రభుత్వాలు తమ తమ ప్రజలను కాపాడడానికి అనేక చర్యలు తీసుకుంటుంటే, బిహార్ ప్రభుత్వం మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.  

Updated Date - 2020-03-27T00:12:51+05:30 IST