చెక్డ్యాంల కోసం స్థల పరిశీలన
ABN , First Publish Date - 2020-05-14T06:06:58+05:30 IST
గూడూరు మండలం బొల్లెపల్లి, తీగలవేణి, గూడూరు ప్రాంతాల్లో చెక్డ్యాంల నిర్మా ణం కోసం నిధులు మంజూరయ్యాయి.ఈ చెక్డ్యాంల కోసం
గూడూరు రూరల్, మే 13: గూడూరు మండలం బొల్లెపల్లి, తీగలవేణి, గూడూరు ప్రాంతాల్లో చెక్డ్యాంల నిర్మా ణం కోసం నిధులు మంజూరయ్యాయి.ఈ చెక్డ్యాంల కోసం ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ బుధవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు చెక్డ్యాంల నిర్మాణంతో 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
ఆయన వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు భరత్కుమార్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఖాసీం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, ఎంపీపీ బానోత్ సుజాతమోతీలాల్, సర్పంచ్లు ముక్క లక్ష్మణ్రావు, తులసిరాంనాయక్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి నూకల సురేందర్ ఉన్నారు.