స్వచ్ఛ వాతావరణం కోసం మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2021-06-19T05:23:17+05:30 IST

స్వచ్ఛమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

స్వచ్ఛ వాతావరణం కోసం మొక్కలు నాటాలి
మనోహరాబాద్‌ మండలం దండుపల్లిలో మొక్కను నాటుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌

జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), జూన్‌ 18: స్వచ్ఛమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు.  శుక్రవారం మనోహరాబాద్‌ మండలం దండుపల్లి వద్ద హైవే రోడ్డు పక్కన, వైకుంఠధామంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా  జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. కాలుష్యాన్ని పారదోలేందుకు ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, తూప్రాన్‌ ఫాక్స్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ వైస్‌ ప్రసిడెంట్‌ యంజాల విఠల్‌రెడ్డి, సర్పంచు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-19T05:23:17+05:30 IST