విస్తృతంగా మొక్కలు నాటాలి : డీఈవో

ABN , First Publish Date - 2020-08-14T11:17:50+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారాన్ని గ్రామ స్థాయి లో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని విలేజ్‌ ఆడిట్‌

విస్తృతంగా మొక్కలు నాటాలి : డీఈవో

డిచ్‌పల్లి, ఆగస్టు13: ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారాన్ని గ్రామ స్థాయి లో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని విలేజ్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, డీఈవో దుర్గా ప్రసాద్‌ అన్నారు. మండలంలోని ఘన్‌పూర్‌ గ్రామంలో గురువారం హరితహారం, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచిం చారు. అనంతరం పంయాయతీ  కార్యాలయం ఎదుట డీఈవో మొక్కలు నాటా రు. ఆయన వెంట గ్రామ కార్యదర్శి సునీల్‌ ఉన్నారు. 

Updated Date - 2020-08-14T11:17:50+05:30 IST