ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకొచ్చిన తబ్లీగీలు

ABN , First Publish Date - 2020-06-03T10:38:01+05:30 IST

తబ్లీగే జమాత్‌ నుంచి వచ్చిన వారు కరోనా బారిన పడి నెగెటివ్‌ వచ్చిన 38 మంది సభ్యులు బాధితులకు చికిత్స అందించేందుకు

ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకొచ్చిన తబ్లీగీలు

మెహిదీపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తబ్లీగే జమాత్‌ నుంచి వచ్చిన వారు కరోనా బారిన పడి నెగెటివ్‌ వచ్చిన 38 మంది సభ్యులు బాధితులకు చికిత్స అందించేందుకు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. మంగళవారం నానాల్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో ఎంపీ వివరాలు వెల్లడించారు. ఢిల్లీ నుంచి వచ్చి పాజిటివ్‌ నుంచి బయటపడిన వారు కరోనా బారిన పడిన వారిని ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో కార్వాన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ కౌసర్‌ మొహియుద్దీన్‌, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ మీరాజ్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. లాక్‌డౌన్‌ విధించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని తెలిపారు.

Updated Date - 2020-06-03T10:38:01+05:30 IST