‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ మన్ప్రీత్
ABN , First Publish Date - 2020-02-14T09:47:24+05:30 IST
భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రకటించింది...
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు లభించిన తొలి భారతీయుడు మన్ప్రీత్నే కావడం విశేషం. ఆన్లైన్ ఓటింగ్లో మన్ప్రీత్కు 35.2 శాతం ఓట్లు రాగా, ఆర్థర్ వాన్ డొర్రెన్ (బెల్జియం) 19.7, లుకాస్ విల్లా (అర్జెంటీనా) 16.5 శాతం ఓట్లు వచ్చాయి. 27 ఏళ్ల ఈ మిడ్ ఫీల్డర్ లండన్ (2012), రియో (2016) ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. గత ఏడాది జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్లో చెలరేగి ఆడిన మన్ప్రీత్ భారత్కు టోక్యో బెర్త్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ‘ఈ అవార్డు భారత జట్టుకు అంకితమిస్తున్నా. నాకు ఓటేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు’ అని మన్ప్రీత్ ట్వీట్ చేశాడు.