హోటల్‌లో పేకాట..12 మంది అరెస్టు

ABN , First Publish Date - 2022-01-24T06:31:19+05:30 IST

హోటల్‌లో పేకాట..12 మంది అరెస్టు

హోటల్‌లో పేకాట..12 మంది అరెస్టు

విజయవాడ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌లో పేకాడుతున్న గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.60వేలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు, విజయవాడ, గన్నవరం ప్రాంతాలకు చెందిన 12 మంది ఓ హోటల్‌లో పేకాడుతున్నారన్న సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న వారిలో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నట్టు తెలిసింది. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 

Updated Date - 2022-01-24T06:31:19+05:30 IST