ప్లీజ్ మాస్క్ ధరించండి: ఫేస్‌బుక్ సీఈఓ

ABN , First Publish Date - 2020-07-02T07:51:40+05:30 IST

అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్, ఆయన సతీమణి సోషల్ మీడియా ద్వారా మాస్క్ ధరించాలంటూ

ప్లీజ్ మాస్క్ ధరించండి: ఫేస్‌బుక్ సీఈఓ

వాషింగ్టన్: అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్, ఆయన సతీమణి సోషల్ మీడియా ద్వారా మాస్క్ ధరించాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. మాస్క్ ధరించి భార్యతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన జూకర్ బర్గ్.. ‘దయచేసి మాస్క్‌ను ధరించండి. అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశంలో ఆంక్షలు విధించకుండా, ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా మాస్క్ సహాయం చేస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు 27లక్షలకు పైగా ప్రజలు కరోనా బారినపడ్డారు. 1.30లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. 


Updated Date - 2020-07-02T07:51:40+05:30 IST