యువీ విరాళం అరకోటి

ABN , First Publish Date - 2020-04-06T09:39:39+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కరోనాపై సమరానికి ముందుకొచ్చాడు. ఈ వైర్‌సపై పోరాటం కోసం పీఎం కేర్స్‌ నిధికి రూ. 50 లక్షలు ...

యువీ విరాళం అరకోటి

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కరోనాపై సమరానికి ముందుకొచ్చాడు. ఈ వైర్‌సపై పోరాటం కోసం పీఎం కేర్స్‌ నిధికి రూ. 50 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్టు యువీ ఆదివారం ట్విటర్‌లో వెల్లడించాడు. ‘మనమంతా ఒక్కటిగా ఉంటే మరింత శక్తిమంతులవుతాం. ప్రస్తుత పోరాటానికి నా వంతుగా రూ. 50 లక్షలను అందజేస్తున్నా. మీరూ.. ముందుకు రండి’ అని యువరాజ్‌ ట్వీట్‌ చేశాడు. సచిన్‌, రైనా, కోహ్లీ సహా మరికొందరు క్రికెటర్లు ఇప్పటికే కరోనాపై పోరుకు తమవంతు సాయం అందజేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-04-06T09:39:39+05:30 IST