వందల ఏళ్ల నిరీక్షణ ఫలించింది: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-08-05T19:36:28+05:30 IST

వందల ఏళ్ల నిరీక్షణ ఫలించిందని ప్రధాని మోదీ అన్నారు. భూమి పూజ అనంతరం మాట్లాడిన ఆయన..

వందల ఏళ్ల నిరీక్షణ ఫలించింది: ప్రధాని మోదీ

అయోధ్య: వందల ఏళ్ల నిరీక్షణ ఫలించిందని ప్రధాని మోదీ అన్నారు. రామాలయానికి భూమి పూజ అనంతరం మాట్లాడిన ఆయన.. జైశ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. జైశ్రీరామ్ నినాదాలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయన్నారు. దేశమంతా రామమయం అయ్యిందన్నారు. దేశ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయమన్నారు. ఏళ్ల పాటు రామ లల్లా ఆలయం టెంట్‌లోనే కొనసాగిందన్నారు. రాముడి కార్యక్రమాలను హనుమంతుడు చేస్తాడని మోదీ వ్యాఖ్యానించారు. కోట్లమందికి ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమని తెలిపారు.  

Updated Date - 2020-08-05T19:36:28+05:30 IST