రాష్ట్రంలోని పరిస్థితులను ప్రధానికి వివరించిన సీఎం
ABN , First Publish Date - 2020-04-02T20:19:20+05:30 IST
ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ వివరించారు.
అమరావతి: ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ వివరించారు. గడచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను ప్రధానికి తెలిపారు. నమోదైన కేసుల్లో 111 జమాత్కు వెళ్లినవారివేనన్నారు. వారితో కాంటాక్టులో ఉన్నవారేనని సీఎం అన్నారు. కుటుంబాల వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి తెలిపారు. వారిని క్వారంటైన్, ఐసోలేషన్కు తరలించామని.. వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్నారు. కోవిడ్ – 19 కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని.. తగిన విధంగా ఆదుకోవాలని సీఎం జగన్ కోరారు. మెడికల్ పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని విజ్ఞప్తి చేశారు.