మరికాసేపట్లో ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్ అజెండాలో ప్రసంగించనున్న మోదీ

ABN , First Publish Date - 2022-01-18T01:54:47+05:30 IST

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరికాసేపట్లో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)..

మరికాసేపట్లో ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్ అజెండాలో ప్రసంగించనున్న మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరికాసేపట్లో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) దావోస్ అజెండాలో ప్రసంగించనున్నారు. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది ఈ సదస్సు వర్చువల్‌గా జరుగుతోంది. మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఇజ్రాయిల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వోన్ డెర్ లెయెన్, నైజీరియా ఉపాధ్యక్షుడు యెమి ఒసిన్‌బాజో, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్, ప్రపంచ ఆరోగ్య  సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోమ్, ప్రపంచ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా తదితరులు ప్రసంగించనున్నారు.  

Updated Date - 2022-01-18T01:54:47+05:30 IST