కొత్త యూపీఐ పేమెంట్ యాప్.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ABN , First Publish Date - 2021-08-02T06:48:34+05:30 IST
దేశంలోకి మరో కొత్త యూపీఐ యాప్ రానుంది. దీనిని స్వయంగా ప్రధాని చేతుల మీదుగా ఈ యాప్ ప్రారంభం..
న్యూఢిల్లీ: దేశంలోకి మరో కొత్త యూపీఐ యాప్ రానుంది. దీనిని స్వయంగా ప్రధాని చేతుల మీదుగా ఈ యాప్ ప్రారంభం కానుంది. ఈ-రుపీ పేరుతో ఈ యాప్ రానుంది. దీనిని ప్రధాని ఈ రోజు(సోమవారం) ప్రారంభించనున్నారు. ఈ వౌచర్స్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ యాప్లోని వౌచర్స్ ముందుగా చెల్లింపులు జరిపి ఆ కోడ్స్ను వేరే వారికి మెసేజ్ లేదా క్యూఆర్ కోడ్ రూపంలో చేయవచ్చని సమాచారం. ఇవి ఓ వ్యక్తి లేదా ఓ అవసరం కోసం మాత్రమే కేటాయించబడి ఉంటాయి. అంటే ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్ కోసం ఓ వౌచర్ను తీసుకుంటే ఆ వౌచర్ ఇక వ్యాక్సినేషన్కు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ యూపీఐ యాప్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.