మోదీ నేతృత్వంలో 28న అఖిల పక్ష సమావేశం

ABN , First Publish Date - 2021-11-22T21:19:20+05:30 IST

ఈనెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 28వ తేదీ..

మోదీ నేతృత్వంలో 28న అఖిల పక్ష సమావేశం

న్యూఢిల్లీ: ఈనెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 28వ తేదీ ఆదివారం అఖిలపక్ష సమావేశం జరుగనున్నట్టు సమాచారం. దీనికి ప్రధానమంత్రి మోదీ అధ్యక్షత వహించనున్నారు. మధ్యాహ్నం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. అనంతరం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ సమావేశం, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సభాపక్ష నేతలతో సమావేశం ఉంటుంది. ప్రధాని ఈ రెండు సమావేశాలకు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.


ఈనెల 29 నుంచి డిసెంబర్ 23 వరకూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫారసు చేసింది. వివాదాస్పద సాగు చట్టాల రద్దుకు ఈ సమావేశాల్లో లాంఛనాలు పూర్తి చేస్తామని ప్రధాని ఇటీవల ప్రకటించడం, త్వరలోనే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Updated Date - 2021-11-22T21:19:20+05:30 IST